Thursday 10 August, 2006

హిందీ భాష

మనదేశంలో ప్రాచీనకాలంలో ప్రజలు ఒకరితొ ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు సహజంగా ఏర్పడిన భాష ప్రాకృతం. అంటే "ప్రకృతి" సహజంగా రూపొందిందని అర్థం. ఆ భాషకు పదాల ఉచ్చారణకు, వాక్యనిర్మాణానికి సంబంధించి కొన్ని సూత్రాలు, నియమాలు ఏర్పరిచి "సంస్కరిస్తే" అది సంస్కృతమైంది. సంస్కరించబడింది సంస్కృతం. (క్రీస్తు పుట్టడానికి 500 ఏళ్ళక్రితం పాణిని రాసిన సంస్కృత వ్యాకరణగ్రంథం అష్టాధ్యాయి ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ప్రామాణిక వ్యాకరణగ్రంథం). ప్రజల భాష ఐన ప్రాకృతానికి మరో రూపమే పాళీ భాష. బుద్ధుడి కాలం నుంచి మధ్యయుగంలో విదేశీ దండయాత్రలు మొదలయ్యేవరకు ఉత్తరభారతదేశమంతటా అదే ప్రజల భాష. తురుష్క సుల్తానుల కాలంలోనూ, మొఘలు చక్రవర్తుల కాలంలోనూ తురుష్క, పర్షియన్, తదితర పశ్చిమాసియా, ఐరోపా దేశాలవారి సాంగత్యంతో ప్రజల భాష పూర్తిగా మారిపోయింది. అనేక పరభాషాపదాలు వచ్చి చేరాయి. కొన్ని సంస్కృత పదాలు, కొన్ని ప్రాకృతపదాలు, కొన్ని విదేశీ పదాల కలయికతో ఒక కొత్త భాష పుట్టింది. అదే హిందీ! మొదట్లో హిందీ భాషకు ఒక లిపి అంటూ లేదు. అందుకే మన రాజ్యాంగంలో 343వ ఆర్టికల్లో "Official language of the Union.—(1) The official language of the Union shall be Hindi in Devanagari script." అని ప్రత్యేకంగా పేర్కొన్నారు.

348. Language to be used in the Supreme Court and in the High Courts and for Acts, Bills, etc.—(1) Notwithstanding anything in the foregoing provisions of this Part, until Parliament by law otherwise provides—

(a) all proceedings in the Supreme Court and in every High Court,

(b) the authoritative texts—

(i) of all Bills to be introduced or amendments thereto to be moved in either House of Parliament or in the House or either House of the Legislature of a State,

(ii) of all Acts passed by Parliament or the Legislature of a State and of all Ordinances promulgated by the President or the Governor of a State, and

(iii) of all orders, rules, regulations and bye-laws issued under this Constitution or under any law made by Parliament or the Legislature of a State,
.
.
.
.
.
.
.
shall be in the English language.

ఇలా హిందీని నామమాత్రపు అధికారభాషగా ప్రకటించాక ఆ భాషతో పెద్దగా పరిచయం లేని దక్షిణాది రాష్ట్రాలవాళ్ళు - మరీ ముఖ్యంగా తమిళులు - అభ్యంతరం తెలిపారు. దాని ఫలితమే త్రిభాషాసూత్రం: ఎవరి మాతృభాషను వాళ్ళు నేర్చుకుంటారు. మనదేశం బహుభాషాసమాజం కాబట్టి ఆంగ్లభాష అనుసంధానభాషగా ఉంటుంది. ప్రతి రాష్ట్రంలోనూ బళ్ళలో పిల్లలకు వారి మాతృభాష, ఆంగ్లభాషకు తోడు ఇంకొక భాష నేర్పాలి. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ ఇంకొక భాష హిందీ కాగా హిందీ అధికారభాషగా ఉండే రాష్ట్రాల్లో ఏదైనా ఒక దక్షిణాది భాష ఉంటుంది. ఐతే ఈ త్రిభాషాసూత్రాన్ని అమలు చేస్తున్న ఏకైక ఉత్తరాది రాష్ట్రం హర్యానా కాగా వాళ్ళు నేర్చుకుంటున్న దక్షిణాది భాష తెలుగు. ఇక్కడ మనం మొక్కుబడిగా హిందీ నేర్చుకున్నట్లే అక్కడ వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు.

దీన్ని బట్టి తెలిసేదేమిటి? పేరుకు హిందీ అధికారభాషే గానీ ఆచరణలో హిందీతో సహా అన్ని భారతీయ భాషల పరిస్థితీ ఒకటేనని.

No comments: