అన్ని మతాలూ అహింస గురించి చెప్పినా అహింసను మరీ ఆచరణసాధ్యం కానంత తీవ్ర స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం జైనమతమే. జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి కూడా అదే కారణమేమో? ఎందుకంటే గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగడం సరే, అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు. ఇలాంటివాళ్ళు నేలను చీల్చి దున్నే వ్యవసాయం ఏం చేస్తారు చెప్పండి? అందుకే జైనులు బతకడానికి వ్యాపారాలు (వడ్డీ వ్యాపారంతో సహా) చేయవలసిందేగానీ వ్యవసాయం చేయడానికి లేదు. వ్యవసాయం చెయ్యకపోతే తిండెలా వస్తుంది? జనాలెలా బ్రతుకుతారు? ఈ విపరీతధోరణి వాళ్ళు జీవులను ఏకేంద్రియ నుంచి పంచేంద్రియ వరకు చేసిన వర్గీకరణలో కూడా కనబడుతుంది:
జైనమతం పంచ భూతాలకు సంబంధించిన జీవుల గురించి ఇలా చెప్తుంది: పృథ్వీకాయ, అప్కాయ, తేజోకాయ, వాయుకాయ, వనస్పతికాయ జీవులు. ఇవి ఏకేంద్రియ జీవులట (స్పర్శజ్ఞానం మాత్రమున్నవి). అవి వాటినెవరైనా తాకితే గుర్తుపడతాయట.
రాళ్ళు, మట్టి, గవ్వల్లాంటివి పృథ్వీకాయ జీవులు.
నీటికున్న వేర్వేరు రూపాలు మంచు, ఆవిరి, నీరు, వానలాంటివి అప్కాయ జీవులు.
మంట, మెరుపు, బూడిద లాంటివి తేజోకాయ జీవులు.
గాలి, పెనుగాలి, తుఫాన్ లాంటివి వాయుకాయ జీవులు.
ఇక వృక్ష సంబంధమైన వనస్పతిక జీవుల్లో మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఒక్కోదానిలో ఒక్కో ఆత్మే ఉంటుందట. అందుకని ఇవి ఏకకాయజీవులు. ఉర్లగడ్డలు, కంద, చేమ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మొదలైనవి అసంఖ్యాక ఆత్మలు గల బహుకాయజీవులు. ఈ రెండు రకాలూ వనస్పతిక జీవులే.
ఈ ఐదు రకాల జీవుల్లో ఒక్కో జీవికీ 4 ప్రాణాలు (స్పర్శ, శ్వాస, శరీరం, ఆయుష్షు) ఉంటాయట. ఇక పంచేంద్రియజీవులకు 10 ప్రాణాలుంటాయని వాళ్ళ నమ్మకం. ఈ ఏకేంద్రియ జీవులు కూడా పదార్థాన్ని ఆహారం, శరీరం, ఇంద్రియాలు, శ్వాసోశ్వాసలు అనే నాలుగు మార్గాల ద్వారా స్వీకరించి దాన్ని శక్తిగా మార్చుకుని బతుకుతాయట.
Showing posts with label ఆధ్యాత్మికం. Show all posts
Showing posts with label ఆధ్యాత్మికం. Show all posts
Sunday, 1 April 2007
Wednesday, 31 May 2006
భక్తి
భక్తి అనేది మనం చెడ్డ పనులు చెయ్యకుండా మనలో పాపభీతి కలగడానికి, ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా దేవుడి మీద భారం వేసి ధైర్యంగా నిలవడానికి తోడ్పడితే బాగుంటుంది. అవసరంలో ఉన్నవారిని యథాశక్తి ఆదుకొమ్మని ప్రేరేపిస్తే మరీ బాగుంటుంది.
అలా కాకుండా అది వెర్రి తలలు వేస్తే అసలుకే మోసం వస్తుంది. గొప్ప భక్తుల కథలుగా చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ఈ కథల్ని చదివితే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు:
1. గుణనిధి కథ: ఈ గుణనిధి అనేవాడు అనేవాడొక దుర్గుణాల నిధి. జీవితమంతా జూదం, దోపిడీలు, వ్యభిచారం తదితర పాపకార్యాలన్నీ చేసి ఒక రాత్రి పొద్దుపోయాక ఒకరిని హత్య చేసి పారిపోతూ ఒక శివాలయంలో దాక్కుంటాడు. ఆ రోజు శివరాత్రట. ఏ క్షణానైనా రక్షక భటులు వస్తారేమోననే భయంతో ఆ రాత్రంతా మేలుకునే ఉంటాడు. ఆరిపోబోతున్న దీపం వత్తిని వెలుతురు కోసం ఎగదోస్తాడు. తర్వాత తనకు తెలియకుండానే అతడు చేసిన పనుల వల్ల శివలింగానికి అభిషేకమో ఇంకొకటో జరుగుతుంది. ఏతావాతా అతడు ఆ ఒక్క రాత్రి తనకు తెలియకుండానే చేసిన పనుల (జాగారము, దీపారాధన, మొ.) వల్ల బోలెడంత పుణ్యం వచ్చి అతడు నేరుగా కైలాసానికే వెళ్ళిపోతాడు.
2. ఇంకొకడి పేరు అజామిళుడని గుర్తు. వాడు కూడా జీవితమంతా పాపాలే చేసి చివరి క్షణాల్లో తన కొడుకును "నారాయణా!" అని పిలుస్తాడు. ఆ పిలుపు విని విష్ణుభటులు వచ్చి వాణ్ణి వైకుంఠానికి తీసుకుపోతారు!
చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాప పడి మంచి మార్గంలోకి మళ్ళితే ప్రయోజనముంటుంది గానీ ఇలా తమ ప్రమేయం లేకుండా జరిగిన పనుల ఫలితాన్ని వాళ్ళకు ఆపాదించి అదే గొప్ప భక్తిగా ప్రచారం చేసేవాళ్ళ గురించి ఏమనుకోవాలో అర్థం కాదు. "చిత్తశుద్ధి లేని శివపూజలేల?" అన్నా వినిపించుకునే వారెవరు?
ఇంకోవైపు ఈ మధ్య కాలంలో భక్తి అనేది పెద్ద ఫాషనైపోయింది. తెలిసి తెలిసీ తాము చేసే తప్పుడు పనులు, తొక్కే అడ్డదారులు ఎక్కువవుతున్న కొద్దీ వ్రతాలు, పూజలు కూడా ఎక్కువవుతాయి. వాటిలో ఏ ఒక్కటైనా ఫలించి తామూ గుణనిధిలాగో, అజామిళుడిలాగో ముక్తిని పొందుదామనే "దురాశ" కూడా ఏ మూలో ఉంటుంది. అందుకే చాలా మందికి దేవుడి మీద కంటే తమ భక్తిని "ప్రదర్శించడం" మీదే శ్రద్ధ ఎక్కువ. పబ్లిసిటీకి వీళ్ళు దాసులు. వ్రతాలు, ఉపవాసాలు ఎక్కువగా చేసేవాళ్ళు (అందరూ కాదు లెండి!), ఉపవాసం పేరు చెప్పి అన్నం ఒక్కటీ మానేసి ఇతర పదార్థాలతో కడుపు నిండా భోంచేసేవాళ్ళు ఈ కోవకు చెందిన వాళ్ళే.
భక్తి పేరుతో మూగజీవుల ప్రాణాలు తీస్తే సంతోషించే దేవతలు మనకి ఉన్నందుకు మనం నిజంగా సిగ్గు పడాలి. ఎందుకంటే సృష్టిలోని సకల చరాచర జీవుల్లో దైవత్వాన్ని చూడగలం మనం. ప్రతి చెట్టు-పుట్టను, రాయి-రప్పను పూజిస్తాం. చేపలు, పందులు సైతం భగవదవతారాలు (దశావతారాల్లో). ఎద్దు, ఎలుక తదితరాలు మన దేవుళ్ళ వాహనాలు. జీవహింస మహాపాపమని వల్లిస్తాం. కానీ అదే దేవుని పేరు చెప్పి ఆ జంతువులనే పాశవికంగా హతమారుస్తాం.
మానవసేవే మాధవసేవని వల్లిస్తాం. అవసరంలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం గురించి ఆలోచించం. ఇవన్నీ చూస్తూ కూడా పలకవేమని దేవుణ్ణి అడిగితే వింటూ కూడా ఆయన పలకడు. ఐనా పలకవలసింది దేవుడు కాదండీ మనుషుల్లోని ఇంగితజ్ఞానం మేల్కొనాలి. ఒకసారి పలికితే ఏమవుతుందో ఆయనకు తెలుసు. కొంపదీసి ఆ దేవుడే గనక ఎవరికైనా పలికితే ఈ భక్తులు ఆయన్ని బతకనిస్తారా? సృష్టినే తలక్రిందులు చేసే తమ విపరీతమైన కోరికలతో ఆయనకు పిచ్చెక్కేలా చేయరూ? అందుకే దేవుడెప్పటికీ అలా passive గా ఉండడమే మంచిది.
(పూజలు, వ్రతాలు ఇళ్ళలోనే కాదు గుళ్ళలో కూడా కొందరు పూజారుల వల్ల ఎంత హాస్యాస్పదంగా తయారవుతున్నాయో నా మరో బ్లాగులో చదవండి.)
భక్తిని గురించి ఈ పోస్టులు కూడా చూడండి:
1. భక్తి
2. భక్తి బేసిక్స్
అలా కాకుండా అది వెర్రి తలలు వేస్తే అసలుకే మోసం వస్తుంది. గొప్ప భక్తుల కథలుగా చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ఈ కథల్ని చదివితే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు:
1. గుణనిధి కథ: ఈ గుణనిధి అనేవాడు అనేవాడొక దుర్గుణాల నిధి. జీవితమంతా జూదం, దోపిడీలు, వ్యభిచారం తదితర పాపకార్యాలన్నీ చేసి ఒక రాత్రి పొద్దుపోయాక ఒకరిని హత్య చేసి పారిపోతూ ఒక శివాలయంలో దాక్కుంటాడు. ఆ రోజు శివరాత్రట. ఏ క్షణానైనా రక్షక భటులు వస్తారేమోననే భయంతో ఆ రాత్రంతా మేలుకునే ఉంటాడు. ఆరిపోబోతున్న దీపం వత్తిని వెలుతురు కోసం ఎగదోస్తాడు. తర్వాత తనకు తెలియకుండానే అతడు చేసిన పనుల వల్ల శివలింగానికి అభిషేకమో ఇంకొకటో జరుగుతుంది. ఏతావాతా అతడు ఆ ఒక్క రాత్రి తనకు తెలియకుండానే చేసిన పనుల (జాగారము, దీపారాధన, మొ.) వల్ల బోలెడంత పుణ్యం వచ్చి అతడు నేరుగా కైలాసానికే వెళ్ళిపోతాడు.
2. ఇంకొకడి పేరు అజామిళుడని గుర్తు. వాడు కూడా జీవితమంతా పాపాలే చేసి చివరి క్షణాల్లో తన కొడుకును "నారాయణా!" అని పిలుస్తాడు. ఆ పిలుపు విని విష్ణుభటులు వచ్చి వాణ్ణి వైకుంఠానికి తీసుకుపోతారు!
చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాప పడి మంచి మార్గంలోకి మళ్ళితే ప్రయోజనముంటుంది గానీ ఇలా తమ ప్రమేయం లేకుండా జరిగిన పనుల ఫలితాన్ని వాళ్ళకు ఆపాదించి అదే గొప్ప భక్తిగా ప్రచారం చేసేవాళ్ళ గురించి ఏమనుకోవాలో అర్థం కాదు. "చిత్తశుద్ధి లేని శివపూజలేల?" అన్నా వినిపించుకునే వారెవరు?
ఇంకోవైపు ఈ మధ్య కాలంలో భక్తి అనేది పెద్ద ఫాషనైపోయింది. తెలిసి తెలిసీ తాము చేసే తప్పుడు పనులు, తొక్కే అడ్డదారులు ఎక్కువవుతున్న కొద్దీ వ్రతాలు, పూజలు కూడా ఎక్కువవుతాయి. వాటిలో ఏ ఒక్కటైనా ఫలించి తామూ గుణనిధిలాగో, అజామిళుడిలాగో ముక్తిని పొందుదామనే "దురాశ" కూడా ఏ మూలో ఉంటుంది. అందుకే చాలా మందికి దేవుడి మీద కంటే తమ భక్తిని "ప్రదర్శించడం" మీదే శ్రద్ధ ఎక్కువ. పబ్లిసిటీకి వీళ్ళు దాసులు. వ్రతాలు, ఉపవాసాలు ఎక్కువగా చేసేవాళ్ళు (అందరూ కాదు లెండి!), ఉపవాసం పేరు చెప్పి అన్నం ఒక్కటీ మానేసి ఇతర పదార్థాలతో కడుపు నిండా భోంచేసేవాళ్ళు ఈ కోవకు చెందిన వాళ్ళే.
భక్తి పేరుతో మూగజీవుల ప్రాణాలు తీస్తే సంతోషించే దేవతలు మనకి ఉన్నందుకు మనం నిజంగా సిగ్గు పడాలి. ఎందుకంటే సృష్టిలోని సకల చరాచర జీవుల్లో దైవత్వాన్ని చూడగలం మనం. ప్రతి చెట్టు-పుట్టను, రాయి-రప్పను పూజిస్తాం. చేపలు, పందులు సైతం భగవదవతారాలు (దశావతారాల్లో). ఎద్దు, ఎలుక తదితరాలు మన దేవుళ్ళ వాహనాలు. జీవహింస మహాపాపమని వల్లిస్తాం. కానీ అదే దేవుని పేరు చెప్పి ఆ జంతువులనే పాశవికంగా హతమారుస్తాం.
మానవసేవే మాధవసేవని వల్లిస్తాం. అవసరంలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం గురించి ఆలోచించం. ఇవన్నీ చూస్తూ కూడా పలకవేమని దేవుణ్ణి అడిగితే వింటూ కూడా ఆయన పలకడు. ఐనా పలకవలసింది దేవుడు కాదండీ మనుషుల్లోని ఇంగితజ్ఞానం మేల్కొనాలి. ఒకసారి పలికితే ఏమవుతుందో ఆయనకు తెలుసు. కొంపదీసి ఆ దేవుడే గనక ఎవరికైనా పలికితే ఈ భక్తులు ఆయన్ని బతకనిస్తారా? సృష్టినే తలక్రిందులు చేసే తమ విపరీతమైన కోరికలతో ఆయనకు పిచ్చెక్కేలా చేయరూ? అందుకే దేవుడెప్పటికీ అలా passive గా ఉండడమే మంచిది.
(పూజలు, వ్రతాలు ఇళ్ళలోనే కాదు గుళ్ళలో కూడా కొందరు పూజారుల వల్ల ఎంత హాస్యాస్పదంగా తయారవుతున్నాయో నా మరో బ్లాగులో చదవండి.)
భక్తిని గురించి ఈ పోస్టులు కూడా చూడండి:
1. భక్తి
2. భక్తి బేసిక్స్
Subscribe to:
Posts (Atom)