Showing posts with label టీవీ. Show all posts
Showing posts with label టీవీ. Show all posts

Friday, 15 September 2006

నట్టింటి భూతం

నట్టింటి భూతం పట్ల తస్మాత్ జాగ్రత్త! ఈ భూతం బారిన పడినవాళ్ళకు చిన్నాపెద్దా తేడా లేకుండా శారీరక, మానసిక చురుకుదనం తగ్గిపోవడం, రకరకాల వికారాలు కలగడం ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది.

ఇప్పుడు అది మీ బుర్రలు చెడగొట్టడమే గాక మీ పిల్లల ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం కూడా ఉంది.
ఈ వార్త గత గురువారం హిందూ హైదరాబాదు ఎడిషన్లో వచ్చింది. కానీ ఎందుకనో ఆన్‌లైన్ ఎడిషన్లో కనబడలేదు.

Saturday, 27 May 2006

టీవీ-2(కాలక్షేపం కాలవలు)

వీటిలో వచ్చే కార్యక్రమాలు మళ్ళీ రెండు రకాలు:
సినిమాలు/సినిమాల క్లిప్పింగులు చూపుతూ చెప్పే కబుర్లు: ఇవి దాదాపుగా ప్రమాదరహితమైనవి (లేదా సినిమాల వల్ల ఎంత ప్రమాదమో వీటి వల్ల కూడా అంతే. నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు లేదు). ఇవి కొన్ని కొత్త సినిమాలను చూడమని అదే పనిగా పోరుతాయి. చూసి తలబొప్పి కట్టించుకోవడమూ, చూడక బతికిపోవడమూ మన నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది.

సీరియళ్ళు: అత్యంత ప్రమాదకరమైనవి. ఈ సీరియళ్ళను చూస్తే మతులు పోతాయి...ఉన్నవాళ్ళకు. వీటిలో వశీకరణ లాంటి శక్తి ఏదో ఉంది. ఈ సీరియళ్ళలో ఎక్కువ భాగం కుటుంబ కలహాల చుట్టూనే తిరుగుతాయి. వాటిలో ప్రధాన పాత్రధారులు వాస్తవ ప్రపంచంలో మనమెక్కడా చూడని లేడీ విలన్లు. వాళ్ళను చూస్తే మన గుండెలు అవిసిపోతాయి. వాళ్ల మాటలు గానీ, హావభావాలు గానీ, వాళ్లు చేసే పనులు గానీ, పన్నే కుట్రలు గానీ చూస్తే మనసు పాడవుతుంది. మన ఖర్మ గాలి భోంచేస్తున్నప్పుడు గానీ వాళ్ళను చూడడం సంభవిస్తే తిండి సహించదు. బలవంతాన తినబోతే వాంతవుతుంది. చిన్న పిల్లలు ప్రతి రోజూ ఈ సీరియల్స్ చూస్తూ పెరుగుతున్నట్లైతే ఆడవారి గురించీ, కుటుంబం గురించీ వాళ్లలో ఎలాంటి అభిప్రాయాలు కలుగుతాయో తలచుకుంటేనే భయమేస్తుంది. ఎందుకంటే ఈ సీరియల్స్ లో కుటుంబసభ్యులే ఒకర్నొకరు చంపుకోవడానికి, ఎదుటి వర్గం(?)లోని వాళ్ళ సుఖసంతోషాలను, వ్యాపారాలను నాశనంచేయడానికి అదే పనిగా కుట్రలు పన్నుతూ రాక్షసానందాన్ని పొందుతూ ఉంటారు. (మిత్రులారా! నాదొక విన్నపం: దయచేసి మీ పిల్లల్ని ఇలాంటి టీవీ సీరియళ్ళకు దూరంగా ఉంచండి. ప్రతిరోజూ కనీసం ఒక గంట సేపైనా టీవీ కట్టేసి, పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళతో - పూర్తిగా వాళ్ళతోనే - గడపండి. వాళ్ళు చెప్పే కబుర్లు, కంప్లెయింట్లు వినండి. వాళ్ళకు కథలు చెప్పండి. వాళ్ళ చేత మంచిపుస్తకాలు చదివించండి. చదివి వినిపించండి. వాళ్ళతో కలిసి ఆడండి. పాడండి.)

ఇక ఈ సీరియళ్ళ టేకింగ్ లోని లోపాలు, నటీనటుల నటనా చాతుర్యం(!) చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఇక జీడిపాకంలాగ సా.....................................గుతూ ఇవి చేసే 'ఆగడం' ఉండనే ఉంది.

ఇవే కాకుండా ఇంకో రకం సీరియళ్ళు కూడా ఉన్నాయి. అవే పౌరాణిక సీరియళ్ళు. గతంలో దూరదర్శన్ లో హిందీ రామాయణం వస్తున్న రోజుల్లో ఆ సీరియల్ చూడడం కోసం పెళ్ళి ఎగ్గొట్టి (ఎవరిదో కాదు...సొంత పెళ్ళే) టీవీ ముందు కూర్చున్న పెళ్ళికొడుకులున్నారు. తర్వాత మహాభారతం కూడా ప్రేక్షకులను అలాగే ఆకర్షించింది. పౌరాణికాలకు తోడు బాలసాహిత్యం కూడా టీవీ ద్వారా జనబాహుళ్యంలోకి రావడం శుభపరిణామం.

వీటికి తోడు ఇప్పుడు కొత్తగా వచ్చిన వెర్రి: రకరకాల బహుమతుల ఆశ చూపే ప్రోగ్రాములు. వీటిలో అడిగే ప్రశ్నలు, వాటికి జనాలిచ్చే సమాధానాలెలా ఉంటాయో ఈ మధ్యే రాశాను.

టీవీ-1 (వార్తాప్రవాహాలు)

తెలుగు టీవీ ఛానెళ్ళు ప్రధానంగా రెండు రకాలు: కాలక్షేపం కాలవలు (Entertainment Channels), వార్తాప్రవాహాలు (News Channels). ముందుగా నిరంతర వార్తాప్రవాహాల సంగతి చూద్దాం. తెలుగు వార్తాఛానెళ్ళు తెలుగు వాళ్ళకోసమే ఉద్దేశించినవి కాబట్టి వీటి పరిధి తక్కువ. ఆంధ్రదేశంలో అంత తరచుగా ఏం కొంపలు మునిగిపోతుంటాయి చెప్పండి ప్రతిరోజూ నిమిష నిమిషానికీ - వినడానికి మనకైనా, చెప్పడానికి వాళ్లకైనా? అందుకే ప్రతి అరగంటకూ చెప్పిన వార్తలే మళ్ళీ మళ్ళీ చెప్తూంటారు - ఒక్కోసారి రోజుల తరబడి. ఇక వాళ్ళు చెప్పే వార్తలు ఎలాంటివో ఒక ఉదాహరణ చూడండి: (ఇది అప్పట్లోనే రాయడానికి డ్రాఫ్టు రాసి పెట్టుకున్నా పోస్టు చెయ్యడానికి ఎందుకో బద్ధకించాను.)

రాష్ట్రంలో పరిపాలన సాగించేది మంత్రివర్గమే అయినా పరిపాలన గవర్నరు పేరు మీదే సాగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి తరచుగా (మొక్కుబడిగానైనా) గవర్నరును కలిసి రాష్ట్రంలో పరిపాలన పేరిట అసలేం జరుగుతోందో వివరించాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉంది. రాజ్యాంగంలో అసలేముందో తెలియనివాడు జర్నలిస్టుగా పనిచేయడానికి అనర్హుడు. కానీ క్రితం సారి ముఖ్యమంత్రి అలా 'మర్యాదపూర్వకంగా' గవర్నరును కలవడానికి వెళ్ళినప్పుడు లోపల వాళ్ళేం మాట్లాడుకుంటున్నారోనని బయట ఈ పనీ పాటా లేని జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఊహాగానాలు చేశారు. వాళ్ళకు తోచిందొక్కటే: "మంత్రివర్గ విస్తరణ"! ముఖ్య మంత్రి రాజ్ భవన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే చెప్పేశాడు కూడా - అలాంటి ఉద్దేశమేదీ లేదని. అయినా మన ఘనత వహించిన వార్తా ఛానెళ్ళలో రెండ్రోజుల పాటు ‌దాదాపు మూడు నిమిషాల సేపు ఒక "వార్త" ప్రసారమైది. దాని సారాంశం ఇదీ: ముఖ్యమంత్రి గవర్నరును కలిసింది మంత్రివర్గ విస్తరణ కోసమేనని మేం కథలల్లాం. అవి కేవలం కట్టుకథలేనని ముఖ్యమంత్రి తేల్చేశారు. (ఐనా ఈ కట్టు కథను "వార్తగా" మేమెందుకు ప్రసారం చేస్తున్నామంటారా? ఇలాంటి కథలల్లకపోతే ముప్ఫై నిమిషాల సేపు చెప్పడానికి వార్తలేముంటాయి? వె వ్వె వ్వె :P)
ఇంకా మన వార్తాఛానెళ్ళ అవలక్షణాల్లో కొన్ని:

అశ్లీలమైన క్లిప్పింగుల్ని సభ్యత మరచి రోజంతా చూపించడం (ముఖ్యంగా టీవీ9, మాటీవీ న్యూస్).
(ఈ మధ్య తగ్గించినట్లున్నారు. లేక నేను వార్తలు చూడడం మానేశాను కాబట్టి నాకు కనిపించడం లేదా?)

బీభత్సంగా, జుగుప్సాకరంగా కనిపించే శవాలను, ఇతర దారుణ దృశ్యాలను పదే పదే చూపించడం.

కేవలం అవలక్షణాలనే చెప్పి మంచి లక్షణాలను చెప్పకపోవడం మంచి పద్ధతి కాదు. వీటిలో మంచి మంచి చర్చాకార్యక్రమాలు ప్రసారమవుతూ ఉంటాయి. ప్రేక్షకులు తమ ప్రాపంచిక అవగాహనను పెంచుకోవడానికి ఈ ఛానెళ్ళలో వచ్చే కొన్ని కార్యక్రమాలు తోడ్పడుతూ ఉంటాయి.

Tuesday, 23 May 2006

భాషాంతక కార్యక్రమాలు

భాషాంతక ఛానెళ్ళలో తెలుగు కార్యక్రమాలు

(మీరు సుజనరంజని వెబ్ పత్రికలోగానీ, రచన మాస పత్రికలో గానీ అమెరికాలక్షేపం చదివేవాళ్ళయితే మీరు ఈ పోస్టు చదవనవసరం లేదు. ఈ పోస్టు అందులోనుంచి ఎత్తిరాసిందే. -3vkrm)

రాసిన వారు: వంగూరి చిట్టెన్ రాజు

ఈ మధ్య కొత్తగా వస్తున్న ఒక తెలుగు టీవీ గేం షో నాలుగైదు సార్లు చూశాను. మీరందరూ ఊహించినట్టుగానే ఈ (అంటే ఈనాడు కాదు - సదరు అని మాత్రమే అర్థం -3vkrm) టీవీ షో కూడా నాలుగైదు అమెరికన్ టీవీ షోలను మ్యూజిక్ తో సహా అనుకరిస్తూ వాటిని కలగాపులగం చేసి రంగరించిన "ఒరిజినల్" తెలుగు టీవీ ఆట...

మొదటి సారి ఈ షో చూసినప్పుడు టైటిల్స్ లో "రాడిక్కాస్ కాస్ట్యూములు, విగ్గు, నగలు, వగలు సప్లయిడ్ బై హాలీవుడ్ టైలర్స్ ఆఫ్ అంబాజీపేట" అని ఆవిడ ఫేషన్ కన్సల్టెంట్ వారి పేరు చూసి, ఈ షో నిర్వహించే ఆవిడ పేరు రాడిక్క అని కనిపెట్టేశాను. ఇటువంటి పేరు ఎక్కడా వినక బహుశా ఏ ఇండొనేషియా నుంచో లేక ఇథియోపియా నుంచోఆవిడను దిగుమతి చేసుకుని, చీరా, నగలూ, తెలుగు వగలూ పెట్టారేమో అనుకున్నాను. అంతే కాదు, పోటీ మధ్యలో "మీ బార్యా బరతలలోఎవరు లక్కీ పెర్సను?" అనో, "మీ పెల్లి అయి ఎన్నాలయినది?" అనో 'స్వచ్ఛమైన తెలుగు ఉచ్ఛారణ' క్షమించాలి...స్వచ్‌మనియన తెలుగు ఉత్‌చారణ తో మట్లాడడం కూడా ఆవిడ ఇంపోర్టెడ్ సరుకేమో అనే నా అనుమానానికి దోహదం చేసింది. మరొక సారి సదరు రాడిక్క గారు "బీ టీము వారు ఎరవై (అవును అక్షరాలా ఎరవై) గ్రాముల బంగారం గెలుసుకున్నారు." అనగానే నా అనుమానం పటాపంచలైపోయింది. ఎటొచ్చీ బీ టీము వారు 'గెలుసుకున్నది' అరవై గ్రాములా లేక ఇరవై గ్రాములా నాకు తెలియలేదు. ఎరవయ్యో అంకె గురించి మా లెక్కల మాస్టారు నాకెప్పుడూ చెప్పలేదు.

ఇక రాడిక్క గారు అడిగిన ప్రశ్న ఒకటి:
"ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ప్రాణత్యాగం చేసిన వారు ఎవరు?"
ఎ)మహాత్మా గాంధీ
బి)ఇందిరా గాంధీ
సి)రాజీవ్ గాంధీ
డి)పొట్టి శ్రీరాములు

ఇంత క్లిష్టమైన ప్రశ్నకు 'ఏ' టీములో పదేళ్ళ అబ్బాయి తీవ్రంగా ఆలోచించి "నాకు మొన్ననే మా స్కూలులో ఈ విషయం చెప్పారు. ఆన్సరు రాజీవ్ గాంధీ." అని చాలా విజయగర్వంతో సమాధానం చెప్పాడు.

"నో, రాజీవ్ గంఢీ, ఈజ్ నాట్ థ రైట్ ఆన్సర్" అని రాడిక్క గారు అంగ్రేజీలో అరిచి, "నౌ, ద ప్రశ్న గోస్ టు 'బీ' టీం" అని అటు వేపు తన భారీ తలకాయ తిప్పారు, పూర్తిగా శరీరం తిప్పలేక. సదరు బీ టీములో తల పండిపోయి, గడ్డాలు, మీసాలు వెలిసిపోయి, మాజీ సినీ నటుడు బాబూమోహన్ వేలు విడిచిన మేనత్త పోలికలో ఉన్న ఆయన అంతకంటే విజయగర్వంతో వికటాట్టహాసం చేసి, "ఓస్, ఇంతేనా? నాకు తెలుసు. మనకోసం రాజీవ్ కంటే ముందు ప్రాణత్యాగం చేసింది ఇందిరమ్మ, గరీబీ హటావో" అంటూ ఆవేశపడ్డాడు.

ఇలాంటి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలూ, వాటికి రెండు మూడు తరాల తెలుగువారి సమాధానాలూ విని, ఆనందం పట్టలేక వెంటనే టీవీ కట్టేసి,...నా గురించి సాహిత్యప్రియులు నిఝంగా ఏమనుకుంటున్నారో అని ఒక చిన్న ప్రయత్నం చేద్దామనిపించి ఒక మల్టిపుల్ చాయిస్ ప్రశ్న వేద్దామనుకుంటుండగా మా ఆవిడ బంగారం షో కోసం టీవీ ఆన్ చేసింది.

రాడిక్క గారి కట్టుకున్న చీర, వేసుకున్న నగలు చూస్తూ "అబ్బ, ఎంత బావుందో, ఆ రాధిక ఒంటి మీద కనీసం పది లక్షల రూపాయలైనా ఉంటాయి అన్నీ కలిపి..." అంది మా శ్రీమతి.

"రాధిక ఎవరూ, ఆ యాంకర్ పేరు రాడిక్క కదా?" అన్నాను.

"రాడిక్క ఏమిటి, రాడిక్కా గీడిక్కానూ - మన చిన్నప్పుడు సినిమాలలో హీరోయిన్ వేషాలు వేసేది రాధిక అనీ, అరవమ్మాయి అనుకుంటా" - సమాధానం చెప్తూ నా మొహం చూసి, "ఏం, మొహం అలా ఉంది?"-