ఫోటో: హిందూ
Showing posts with label ప్రసిద్ధులు. Show all posts
Showing posts with label ప్రసిద్ధులు. Show all posts
Thursday, 3 September 2009
Friday, 29 December 2006
మహారచయితకు నివాళి
ఆ కలం సృష్టించిన మాటలు, పాటలు కోట్లాది మంది సినీ ప్రేక్షకుల మీద మత్తు మందు చల్లి తమ వశం చేసుకున్నాయి. పుట్టబోయేవారిని కూడా చేసుకుంటాయి.
ఏదైనా మ్యాజిక్కో, మంత్రమో చేసినట్లు అభినయించాలంటే చిన్న పిల్లలు సైతం అసంకల్పితంగా అనే మాట "హాం ఫట్". ఆ మాటను మనకు పరిచయం చేసింది పాతాళభైరవిలో మాంతికుడు (ఎస్వీరంగారావు). మరి పుట్టించిన అపరబ్రహ్మ ఎవరు?
"డింగరీ", "గురూ", "ఘాటుప్రేమ", "ధైర్యే సాహసే లక్ష్మీ", "నరుడా ఏమి నీ కోరిక?"
అసమదీయులు - తసమదీయులు
వీరతాళ్ళు (ఈనాటి పతకాల లాంటివి)
"ఇవేం మాటలు? ఇంతకు ముందెక్కడా లేవే?" అన్నవారిని "ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?" అని ఎదురు ప్రశ్నించిన మాటల మరాఠీ ఎవరు?
"జనం కోరేది మనం సేయడమా? మనం సేసేది జనం సూడడమా?" ఈ మాటలు పలికింది నేపాళమాంత్రికుడు. ఈ సందిగ్ధం మాత్రం సినిమాలు తీసేవారందరిదీ.
"సాహసం శాయరా డింభకా! రాకుమారి లభించును రా!"
"మహాజనానికి మరదలు పిల్లా! గలగలలాడవే గజ్జెలకోడీ"
"రసపట్టులో తర్కం కూడదు"
"మాకు తల్పం వద్దు గిల్పం కావాలి....కంబళి వద్దు గింబళి కావాలి"
"శాకాంభరీదేవి వరప్రసాదం - ఆంధ్రుల అభిమాన శాకం.....గోంగూర!"
ఈ జాబితాలో వందలు వందల మాటలున్నాయి. చెప్పుకుంటే తనివితీరదు. ఆ మాటలు నెమరేసుకున్నా చాలు. ఐనా ఆ మహనీయుడిని గురించి "మాటల్లో" చెప్పడానికి మనమెంతవారం? 75 యేళ్ళ తెలుగుసినీచరిత్రలో ఎవరెస్టు శిఖరం లాంటి మాటల-పాటల రచయిత పింగళి నాగేంద్రరావు గారి నూట ఆరవ జయంతి ఈరోజు (29 డిసెంబరు).
ఏదైనా మ్యాజిక్కో, మంత్రమో చేసినట్లు అభినయించాలంటే చిన్న పిల్లలు సైతం అసంకల్పితంగా అనే మాట "హాం ఫట్". ఆ మాటను మనకు పరిచయం చేసింది పాతాళభైరవిలో మాంతికుడు (ఎస్వీరంగారావు). మరి పుట్టించిన అపరబ్రహ్మ ఎవరు?
"డింగరీ", "గురూ", "ఘాటుప్రేమ", "ధైర్యే సాహసే లక్ష్మీ", "నరుడా ఏమి నీ కోరిక?"
అసమదీయులు - తసమదీయులు
వీరతాళ్ళు (ఈనాటి పతకాల లాంటివి)
"ఇవేం మాటలు? ఇంతకు ముందెక్కడా లేవే?" అన్నవారిని "ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?" అని ఎదురు ప్రశ్నించిన మాటల మరాఠీ ఎవరు?
"జనం కోరేది మనం సేయడమా? మనం సేసేది జనం సూడడమా?" ఈ మాటలు పలికింది నేపాళమాంత్రికుడు. ఈ సందిగ్ధం మాత్రం సినిమాలు తీసేవారందరిదీ.
"సాహసం శాయరా డింభకా! రాకుమారి లభించును రా!"
"మహాజనానికి మరదలు పిల్లా! గలగలలాడవే గజ్జెలకోడీ"
"రసపట్టులో తర్కం కూడదు"
"మాకు తల్పం వద్దు గిల్పం కావాలి....కంబళి వద్దు గింబళి కావాలి"
"శాకాంభరీదేవి వరప్రసాదం - ఆంధ్రుల అభిమాన శాకం.....గోంగూర!"
ఈ జాబితాలో వందలు వందల మాటలున్నాయి. చెప్పుకుంటే తనివితీరదు. ఆ మాటలు నెమరేసుకున్నా చాలు. ఐనా ఆ మహనీయుడిని గురించి "మాటల్లో" చెప్పడానికి మనమెంతవారం? 75 యేళ్ళ తెలుగుసినీచరిత్రలో ఎవరెస్టు శిఖరం లాంటి మాటల-పాటల రచయిత పింగళి నాగేంద్రరావు గారి నూట ఆరవ జయంతి ఈరోజు (29 డిసెంబరు).
Friday, 8 September 2006
కాళిదాసు కంచుబొమ్మ
గత సంవత్సరం (2005) చైనా ప్రభుత్వం నుంచి మన విదేశాంగశాఖవారికి వచ్చిన ఒక అభ్యర్థన వారిని తెల్లబోయేలా చేసింది. గందరగోళంలోకి నెట్టింది. చైనీయులు కోరింది క్రీ.శ. ఆరవ శతాబ్దానికి చెందిన ఒక మహనీయుడి కాంస్యవిగ్రహం కావాలని. ఆయనెలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కనీసం రేఖాచిత్రాలు కూడా లేవు. అలాంటివాడి ప్రతిమ చేసివ్వమని అడిగితే ఏం చెయ్యడం? ఎలా ఇవ్వడం? అసలు చైనీయులకు ఆ విగ్రహంతో ఏం పనిబడింది?
చైనా ప్రభుత్వం తమ దేశప్రజల్లో సాంస్కృతిక అవగాహనను పెంచడానికిగాను షాంఘై థియేటర్ స్ట్రీట్ లో కాళిదాసు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. ఐతే సమస్యేమిటంటే కాళిదాసు బొమ్మలు కాదుగదా కనీసం ఆయన రూపురేఖావిలాసాదులెలాంటివో తెలిపే వర్ణనలైనా ఎక్కడా లేవు. చైనీయుల అభ్యర్థనను మన విదేశాంగశాఖ వారు భారతదేశ సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR)కి, ఆ మండలి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వమేమో ఉజ్జయినిలో ఉండే కాళిదాసు అకాడెమీకి పంపించారు. ఆ మహాకవి, నాటకకర్త క్రీ.శ. ఆరవ శతాబ్దంలో ఉజ్జయినిలోనే నివసించాడని నమ్ముతున్నారు.
కాళిదాసు రచనలను మనోవిశ్లేషణాత్మక దృక్పథంతో అధ్యయనం చేసిన నిపుణులు ఆయన చాలా అందగాడని తేల్చారు. (ఆయన పేరు మీద ప్రచారంలో ఉన్న అనేక కథలు; సాహిత్య, చారిత్రక గాథలు దీనికి అనుగుణంగానే ఉన్నాయి.) ఈ అంచనాల ఆధారంతో చివరికి తల నుంచి రొమ్ము వరకు గల ఒక 30 అంగుళాల కంచుబొమ్మను తయారుచేయించారు. ఇలాంటి ప్రయత్నం జరగడం మనదేశంలో ఇదే మొదటిసారి. ఈ విగ్రహాన్ని సాంస్కృతిక సంబంధాల మండలికి చెందిన విగ్రహ తయారీ నిపుణుల సంఘం ఆమోదించాక విదేశాంగశాఖ గత జూన్ నెల చివరి వారంలో చైనాకు పంపింది. ఆ విగ్రహాన్ని నిన్ననే షాంఘై థియేటర్ స్ట్రీట్ లో ఆవిష్కరించారు.
అక్కడ కొలువుదీరనున్న 19 మంది జగత్ప్రసిద్ధుల్లో ఆసియా ఖండానికి చెందిన ఒకేఒక వ్యక్తి మహాకవి కాళిదాసు.
మొదటివార్త ట్రిబ్యూన్ లో
తాజావార్త ఈరోజు హిందూ (ప్రింట్ ఎడిషన్)లో
చైనా ప్రభుత్వం తమ దేశప్రజల్లో సాంస్కృతిక అవగాహనను పెంచడానికిగాను షాంఘై థియేటర్ స్ట్రీట్ లో కాళిదాసు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. ఐతే సమస్యేమిటంటే కాళిదాసు బొమ్మలు కాదుగదా కనీసం ఆయన రూపురేఖావిలాసాదులెలాంటివో తెలిపే వర్ణనలైనా ఎక్కడా లేవు. చైనీయుల అభ్యర్థనను మన విదేశాంగశాఖ వారు భారతదేశ సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR)కి, ఆ మండలి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వమేమో ఉజ్జయినిలో ఉండే కాళిదాసు అకాడెమీకి పంపించారు. ఆ మహాకవి, నాటకకర్త క్రీ.శ. ఆరవ శతాబ్దంలో ఉజ్జయినిలోనే నివసించాడని నమ్ముతున్నారు.
కాళిదాసు రచనలను మనోవిశ్లేషణాత్మక దృక్పథంతో అధ్యయనం చేసిన నిపుణులు ఆయన చాలా అందగాడని తేల్చారు. (ఆయన పేరు మీద ప్రచారంలో ఉన్న అనేక కథలు; సాహిత్య, చారిత్రక గాథలు దీనికి అనుగుణంగానే ఉన్నాయి.) ఈ అంచనాల ఆధారంతో చివరికి తల నుంచి రొమ్ము వరకు గల ఒక 30 అంగుళాల కంచుబొమ్మను తయారుచేయించారు. ఇలాంటి ప్రయత్నం జరగడం మనదేశంలో ఇదే మొదటిసారి. ఈ విగ్రహాన్ని సాంస్కృతిక సంబంధాల మండలికి చెందిన విగ్రహ తయారీ నిపుణుల సంఘం ఆమోదించాక విదేశాంగశాఖ గత జూన్ నెల చివరి వారంలో చైనాకు పంపింది. ఆ విగ్రహాన్ని నిన్ననే షాంఘై థియేటర్ స్ట్రీట్ లో ఆవిష్కరించారు.
అక్కడ కొలువుదీరనున్న 19 మంది జగత్ప్రసిద్ధుల్లో ఆసియా ఖండానికి చెందిన ఒకేఒక వ్యక్తి మహాకవి కాళిదాసు.
మొదటివార్త ట్రిబ్యూన్ లో
తాజావార్త ఈరోజు హిందూ (ప్రింట్ ఎడిషన్)లో
Tuesday, 15 August 2006
స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు

బాలగంగాధర తిలక్ గురించి క్లుప్తంగా:

బాలగంగాధర తిలక్ ని భారతజాతీయోద్యమ పిత గా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India's unrest)గా భావిస్తారు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరివారంలో మూడు రోజులపాటు సమావేశమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను "pray, pitition, protest" చెయ్యడానికే పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశాడు: "మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు." అని, "అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునేవాళ్ళ సంఘం (beggars' institution)" అన్నాడు. కాంగ్రెస్ సమావేశాలను 3-day tamaashaa గా అభివర్ణించాడు. "స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను." అని గర్జించాడు.
ఆయన పాశ్చాత్యవిద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిచాడు - అది భారతీయ సాంస్కృతికవారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చేవిధంగా ఉందని. ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం ఆయనది. ప్రతి భారతీయుడికి/రాలికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నతాన్ని గురించి బోధించాలని ఆయన ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ లతో కలిసి "దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ" ని స్థాపించాడు.
ఆ తర్వాత తాను నడిపిన పత్రికలు "మరాఠా", "కేసరి" లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితులను గురించి వివరంగా రాశాడు. బాల్యవివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించాడు. జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం ఆయనే మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ లోపల కాంగ్రెస్ పార్టీ మితవాదులు - అతివాదుల విభేదాల వల్ల రెండుగా చీలిపోయింది.
1906లో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాసశిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే ఆయన "గీతారహస్యం" అనే పుస్తకం రాశాడు. ఆయన చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని ఆయన అభిప్రాయం. 1916 ఏప్రిల్ లో హొమ్రూల్ లీగ్ ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. అనీబిసెంటు అదే సంవత్సరం సెప్టెంబర్ లో మొదలుపెట్టి హోమ్రూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో ఆయన లండనుకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే, అంటే 1917 ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు "బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని" బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటనతో ఉద్యమాన్ని అపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారీ కావడంతో హోమ్రూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే 1920లో తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమం చుక్కాని లేని నావ అవుతుందని చాలా మంది భయపడ్డారు.
"గాంధీ అని ఇంకొకాయన ఉన్నాడు గానీ....అబ్బే! తిలక్ ముందర ఏపాటి?" అనుకున్నారు. కానీ "నాయకులు చరిత్రను సృష్టించరు. చరిత్రే నాయకులను సృష్టిస్తుంది." అనే మాటను నిజం చేస్తూ అతి సామాన్యుడిగా జీవితం ప్రారంభించిన గాంధీ తిలక్ మరణంతో ఏర్పడ్డ శూన్యాన్ని అసామాన్యంగా భర్తీ చెయ్యడమే గాక మహాత్ముడి స్థాయికి ఎదిగాడు.
జై హింద్!
Monday, 17 July 2006
ఆమె ఎవరు?
ఆమె ఒక శాస్త్రవేత్త.
ఆమె వెండితెర వేలుపు.
ఆమె ఒక సాహసి.
ఆమె ఒక సౌందర్యరాశి.
శాస్త్రవేత్తగా ఆమె ఘనత: frequency hopping: మొదట ఆమె మరొక శాస్త్రవేత్తతో కలిసి రహస్య కమ్యూనికేషన్ వ్యవస్థ (Secret Communication System)ను కనిపెట్టారు. తర్వాత అదే వ్యవస్థను మరొక అడుగు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు కనిపెట్టిన ఫ్రీక్వెన్సీ-హాపింగ్ ప్రస్తుతం మనం విరివిగా వాడుతున్న ఉపకరణాలు -వైర్లతో పనిలేని ఫోన్లు, విఫి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటివాటికి ఆధారభూతమైంది. (frequency hopping రేడియో సంకేతాలు జామ్ అయ్యే అవకాశాన్ని కనిష్ట స్థాయికి తగ్గిస్తుంది.)
వెండితెర మీద: ఆమె 33 ఐరోపా మరియు హాలీవుడ్ సినిమాలలో నటించి ప్రేక్షకుల మతులు పోగొట్టింది.
ఆమె సాహసం: హాలీవుడ్ చరిత్రలో పూర్తి నగ్నంగా వెండితెర మీద కనిపించిన మొట్టమొదటి నటి ఆమే! చిత్రం: ఎక్స్టసీ (1933)
ఆమె అందం: The Heavenly Body (1944)చిత్రంలో

ఆమె పేరు: హెడీ లమర్
ఆమె వెండితెర వేలుపు.
ఆమె ఒక సాహసి.
ఆమె ఒక సౌందర్యరాశి.
శాస్త్రవేత్తగా ఆమె ఘనత: frequency hopping: మొదట ఆమె మరొక శాస్త్రవేత్తతో కలిసి రహస్య కమ్యూనికేషన్ వ్యవస్థ (Secret Communication System)ను కనిపెట్టారు. తర్వాత అదే వ్యవస్థను మరొక అడుగు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు కనిపెట్టిన ఫ్రీక్వెన్సీ-హాపింగ్ ప్రస్తుతం మనం విరివిగా వాడుతున్న ఉపకరణాలు -వైర్లతో పనిలేని ఫోన్లు, విఫి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటివాటికి ఆధారభూతమైంది. (frequency hopping రేడియో సంకేతాలు జామ్ అయ్యే అవకాశాన్ని కనిష్ట స్థాయికి తగ్గిస్తుంది.)
వెండితెర మీద: ఆమె 33 ఐరోపా మరియు హాలీవుడ్ సినిమాలలో నటించి ప్రేక్షకుల మతులు పోగొట్టింది.
ఆమె సాహసం: హాలీవుడ్ చరిత్రలో పూర్తి నగ్నంగా వెండితెర మీద కనిపించిన మొట్టమొదటి నటి ఆమే! చిత్రం: ఎక్స్టసీ (1933)
ఆమె అందం: The Heavenly Body (1944)చిత్రంలో

ఆమె పేరు: హెడీ లమర్
వర్గాలు:
చెప్పుకోండి చూద్దాం,
ప్రసిద్ధులు,
సినిమా
Wednesday, 12 April 2006
మొల్ల
1. 2-4-2006 న వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ద్వా.నా.శాస్త్రి వ్రాసిన ఆర్టికల్ ఇది:
"ఘనమగు సంస్కృతము జెప్పగా రుచియగునే" అని సంస్కృతాధిపత్యాన్ని నిరసించిన కవయిత్రి మొల్ల.
"కందువ మాటల సామెతలందముగా గూర్చి చెప్ప నది తెలుగునకుం
పొందై రుచియై వీనుల విందై" ఉంటుందని తెలుగు భాషాఅభిమానాన్ని ప్రకటించిన కవయిత్రి మొల్ల.
"గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము మూగచెవిటి వారి ముచ్చటగును" అంటూ తెలుగు కవిత్వానికి సారళ్య అవసరాన్ని నొక్కి చెప్పిన కవయిత్రి మొల్ల.
"శ్రీకంఠ మల్లీశు వరము చేత నెఱి కవిత్వంబు చెప్పగా నేర్చుకొంటి" అంటూ భక్తికి పట్టం కట్టిన కవయిత్రి ఆమె.
"తప్పులెంచకుడు కవుల్" అనగల వినయ సంపద గల కవయిత్రి ఆమె.
వాల్మీకి రామాయణాన్ని కథాప్రధానంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పినట్లు గానే వ్రాసిన కవయిత్రి మొల్ల.
మొల్ల కడప జిల్లా గోపవరం గ్రామం లో జన్మించినట్లుగా చాల మంది నిర్ణయించారు.
నెల్లూరు దగ్గర గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయమూ గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్థులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు గోపవరం లో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెంధిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉనారు. మొల్ల నివసిచిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన కూడా గోపవరం వచ్చినట్లుగా కొందరు వృద్ధుల కథనం.
ఇంత చారిత్రక ప్రాధాన్యం గల గోపవరం లో శ్రీకంఠమల్లేశ్వరుని దేవాలయం జీర్ణావస్థలో ఉంది. విగ్రహం ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, దుమ్ములో ఉంది. ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలి. రామాలయంలోని విగ్రహాలను ఎవరో ఎత్తుకుపోయారు. రాముని పటం మాత్రమే ఉంది."మొల్ల బండ"కు పరిరక్షణ లేదు. ఇటీవల మొల్ల జయంతి సందర్భంగా గోపవరంలో మొల్ల విగ్రహావిష్కరణ జరిగింది.దానికి మూల కారకులు విద్వాన్ గానుగపెంట హనుమంత హనుమంత రావు గారు.ఈయన కృషి వల్లనే మొల్ల సాహితీ పీఠం స్థాపించ బడింది. శాలివాహన సంఘం మొల్ల కవితా వ్యాప్తికి నడుం బిగించింది. గానుగపెంట హనుమంత హనుమంత రావు గారు మొల్ల పై చిన్న పుస్తకం కూడా వ్రాశారు.
అయితే మొల్ల కు తగిన న్యాయం లభించిందా? అన్నది ప్రశ్న. ట్యాంక్ బండ్ పై మొల్ల విగ్రహం ప్రతిష్ఠించడమొక్కటే చెప్పుకోదగినది. మొల్ల రామాయణం 1917 లో వావిళ్ళ వెంకటేశ్వర్లు గారు అచ్చు వేశారు.కందుకూరి కవుల చరిత్ర వ్రాసే నాటికి మొల్ల రామాయణం అసలు ప్రతి దొరకలేదేమో ? కానీ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం లో మొల్ల గురించి టూకీ గా మాత్రమే వ్రాశారు. అంటే సమగ్ర విశ్లేషణ చేయదగ్గ కవయిత్రిగా భావించలేదన్న మాట. మొల్లకు న్యాయం జరగాలంటే గోపవరమ్ లో శ్రీకంఠమల్లేశ్వరుని దేవాలయాన్ని పునరుద్ధరించాలి.రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం, మొల్ల బండకు ప్రాధాన్యమిచ్చి కాపాడడం తక్షణం చేపట్టాలి.గోపవరం మండలాన్ని మొల్ల మండలంగా మార్చాలన్న వినతిని కడప జిల్లా పరిషత్ చేర్మన్ అంగీకరించారు.రాజకీయ నాయకుల, పురుషుల పేర్లతో జిల్లాలు, వీధులు ఉంటాయి.స్త్రీల పేర్లతో ఎందుకుండవో అర్థం కాదు.గోపవరాన్ని మొల్ల మండలంగా మారిస్తే అదొక చారిత్రక ఘటన అవుతుంది. తెలుగు విశ్వ విద్యాలయం మొల్ల రామాయణాన్ని వ్యాఖ్యానంతో ముద్రించడం అవసరం. రాయలసీమ అంటే బాంబుల సీమ కాదు ముఠాకకషలకు పుట్టినిల్లు కాదు.అని ఈ తరానికి, రాబోయే తరాలకు చెప్పవలసి ఉంది. మొల్ల, అన్నమయ్య, తిమ్మక్క, వేమన, పోతులూరి వంటి ఎందరో మహానుభావులు జన్మించిన నేలగా, బ్రౌన్ నడయాడిన నేలగా, విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంది. మన సాహితీ అవశేషాలను భద్రపరచవలసి ఉంది. గోపవరాన్ని చారిత్రక పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయవలసి ఉంది.
2. 13-3-2006 న ఈనాడు కడపలో వచ్చిన వార్త~:
అనాదరణకు గురవుతున్న పెద్ద గోపవరం
నేడు జయంతి
శ్రీకృష్ణాదేవరాయల కొలువులోని హాస్యకవి తెనాలి రామలింగనికి సమకాలీనురాలుగా భావిస్తున్న రచయిత్రి మొల్ల తెలుగు రామాయణంతో చరిత్రలో సుస్థిర స్థానం పొందింది. ఆమె పాద ముద్రికలు బద్వేలు మండలం పెద్దగోపవరంలో నిలచి ఆ ఘనతను చాటుతున్నాయి. ఆమె జ్ఞాపికలను పదికాలాల పాటు నిలిపే ప్రయత్నం మాత్రం జరగడం జరగడం లేదు.
వాల్మీకి రామాయణానికి తెలుగు వన్నెలద్దిన మహిళా కవితామూర్తి మొల్ల నేటికీ స్మరణీయురాలే.కానీ తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన ఆమె నివాసగ్రామమైన బద్వేలు నియోజకవర్గంలోని పెద్దగోపవరం మాత్రం నిరాదరణకు గురవుతోంది. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ప్రాంతాన్ని అటు పురావస్తు శాఖ అధికారులు గానీ, ఇటు పర్యాట శాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ఆదికవి వాల్మీకి 24 వేల శ్లోకాల్లో రచించిన రామాయణాన్ని ఆమె తేట తెలుగులో 871 పద్యాలతో కావ్యంగా రచించి చెరగని ముద్ర వేసుకొంది. ఆ మహాయజ్ఞాన్ని ఆమె అయిదు రోజుల్లో పూర్తి చేసినట్లు దక్షిణ హిందూ స్థానపు కవుల చరిత్రలో కావలి వెంకటరామస్వామి పేర్కొని ఆమె ఘనతను కొనియాడారు. గుర్తుగా ఆమె కూర్చొని కవిత్వం రాసిన బండ మాత్రం ఏటా పండుగల సందర్భంగా పూజలను అందుకొంటోంది. ఈమె ఆరధ్య దైవమైన శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం నేచదరమైంది. ఆమె పూజించిన శివలింగం కాలగర్భంలో కలసి పోగా పానుమట్టం మాత్రమే మిగిలింది. వినాయకుడు, తదితర దేవతామూర్తి విగ్రహాలకూ ఇదే దుస్థితి పట్టింది.
శివకేశవుల బేధం ఉన్న రోజుల్లో ఇద్డరూ ఒకటేనని సమాజానికి చాటిచెప్పిన మహనీయురాలు ఆమె. రాముడిని, వేణుగోపాలుడ్నీ, శ్రీకంఠమల్లేశ్వరుడినీ ఆరాధించి ఆధ్యాత్మికంలో ఉన్న గొప్పదనాన్ని చాటింది. ఈ ఆలయాలు ఇప్పటికీ ఆమె జ్ఞాపికలుగా గ్రామంలో నిలిచాయి.
మొల్ల మాండలికాలపై సాహిత్య శోధనలు చేయాలి
మొల్ల తాను రచించిన రామాయణంలో గోపవరం ప్రాంత ప్రజలు మాట్లాడుకొనే పదాలనే కవిత్వంలో వాడిందని, వీటిపై సాహిత్య పరిశోధనలు జరిపించాలనికవయిత్రి మొల్ల సాహిత్య పీఠం గౌరవాధ్యక్షులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏటా మార్చి 13న ఆమె జయంతిని జరుపుతున్నామని తెలిపారు. మొల్ల నివసించిన ఇంటిని స్మారక మందిరంగా మార్చాలని కోరారు.18,19 శతాబ్దాలలో కందుకూరి వీరేశలింగం పంతులు, బద్వేలుకు చెందిన ఆధునిక కవులు జంగా నరసింహశాస్త్రి, జనమంచి శేషాద్రి శర్మ, యాదాటి నరసింహశర్మ తదితరులు మొల్ల రామాయణం గూర్చి చర్చించారని తెలిపారు.
"ఘనమగు సంస్కృతము జెప్పగా రుచియగునే" అని సంస్కృతాధిపత్యాన్ని నిరసించిన కవయిత్రి మొల్ల.
"కందువ మాటల సామెతలందముగా గూర్చి చెప్ప నది తెలుగునకుం
పొందై రుచియై వీనుల విందై" ఉంటుందని తెలుగు భాషాఅభిమానాన్ని ప్రకటించిన కవయిత్రి మొల్ల.
"గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము మూగచెవిటి వారి ముచ్చటగును" అంటూ తెలుగు కవిత్వానికి సారళ్య అవసరాన్ని నొక్కి చెప్పిన కవయిత్రి మొల్ల.
"శ్రీకంఠ మల్లీశు వరము చేత నెఱి కవిత్వంబు చెప్పగా నేర్చుకొంటి" అంటూ భక్తికి పట్టం కట్టిన కవయిత్రి ఆమె.
"తప్పులెంచకుడు కవుల్" అనగల వినయ సంపద గల కవయిత్రి ఆమె.
వాల్మీకి రామాయణాన్ని కథాప్రధానంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పినట్లు గానే వ్రాసిన కవయిత్రి మొల్ల.
మొల్ల కడప జిల్లా గోపవరం గ్రామం లో జన్మించినట్లుగా చాల మంది నిర్ణయించారు.
నెల్లూరు దగ్గర గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయమూ గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్థులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు గోపవరం లో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెంధిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉనారు. మొల్ల నివసిచిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన కూడా గోపవరం వచ్చినట్లుగా కొందరు వృద్ధుల కథనం.
ఇంత చారిత్రక ప్రాధాన్యం గల గోపవరం లో శ్రీకంఠమల్లేశ్వరుని దేవాలయం జీర్ణావస్థలో ఉంది. విగ్రహం ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, దుమ్ములో ఉంది. ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలి. రామాలయంలోని విగ్రహాలను ఎవరో ఎత్తుకుపోయారు. రాముని పటం మాత్రమే ఉంది."మొల్ల బండ"కు పరిరక్షణ లేదు. ఇటీవల మొల్ల జయంతి సందర్భంగా గోపవరంలో మొల్ల విగ్రహావిష్కరణ జరిగింది.దానికి మూల కారకులు విద్వాన్ గానుగపెంట హనుమంత హనుమంత రావు గారు.ఈయన కృషి వల్లనే మొల్ల సాహితీ పీఠం స్థాపించ బడింది. శాలివాహన సంఘం మొల్ల కవితా వ్యాప్తికి నడుం బిగించింది. గానుగపెంట హనుమంత హనుమంత రావు గారు మొల్ల పై చిన్న పుస్తకం కూడా వ్రాశారు.
అయితే మొల్ల కు తగిన న్యాయం లభించిందా? అన్నది ప్రశ్న. ట్యాంక్ బండ్ పై మొల్ల విగ్రహం ప్రతిష్ఠించడమొక్కటే చెప్పుకోదగినది. మొల్ల రామాయణం 1917 లో వావిళ్ళ వెంకటేశ్వర్లు గారు అచ్చు వేశారు.కందుకూరి కవుల చరిత్ర వ్రాసే నాటికి మొల్ల రామాయణం అసలు ప్రతి దొరకలేదేమో ? కానీ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం లో మొల్ల గురించి టూకీ గా మాత్రమే వ్రాశారు. అంటే సమగ్ర విశ్లేషణ చేయదగ్గ కవయిత్రిగా భావించలేదన్న మాట. మొల్లకు న్యాయం జరగాలంటే గోపవరమ్ లో శ్రీకంఠమల్లేశ్వరుని దేవాలయాన్ని పునరుద్ధరించాలి.రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం, మొల్ల బండకు ప్రాధాన్యమిచ్చి కాపాడడం తక్షణం చేపట్టాలి.గోపవరం మండలాన్ని మొల్ల మండలంగా మార్చాలన్న వినతిని కడప జిల్లా పరిషత్ చేర్మన్ అంగీకరించారు.రాజకీయ నాయకుల, పురుషుల పేర్లతో జిల్లాలు, వీధులు ఉంటాయి.స్త్రీల పేర్లతో ఎందుకుండవో అర్థం కాదు.గోపవరాన్ని మొల్ల మండలంగా మారిస్తే అదొక చారిత్రక ఘటన అవుతుంది. తెలుగు విశ్వ విద్యాలయం మొల్ల రామాయణాన్ని వ్యాఖ్యానంతో ముద్రించడం అవసరం. రాయలసీమ అంటే బాంబుల సీమ కాదు ముఠాకకషలకు పుట్టినిల్లు కాదు.అని ఈ తరానికి, రాబోయే తరాలకు చెప్పవలసి ఉంది. మొల్ల, అన్నమయ్య, తిమ్మక్క, వేమన, పోతులూరి వంటి ఎందరో మహానుభావులు జన్మించిన నేలగా, బ్రౌన్ నడయాడిన నేలగా, విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంది. మన సాహితీ అవశేషాలను భద్రపరచవలసి ఉంది. గోపవరాన్ని చారిత్రక పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయవలసి ఉంది.
2. 13-3-2006 న ఈనాడు కడపలో వచ్చిన వార్త~:
మొల్ల ఊరు..మరచి పోయారు
అనాదరణకు గురవుతున్న పెద్ద గోపవరం
నేడు జయంతి
శ్రీకృష్ణాదేవరాయల కొలువులోని హాస్యకవి తెనాలి రామలింగనికి సమకాలీనురాలుగా భావిస్తున్న రచయిత్రి మొల్ల తెలుగు రామాయణంతో చరిత్రలో సుస్థిర స్థానం పొందింది. ఆమె పాద ముద్రికలు బద్వేలు మండలం పెద్దగోపవరంలో నిలచి ఆ ఘనతను చాటుతున్నాయి. ఆమె జ్ఞాపికలను పదికాలాల పాటు నిలిపే ప్రయత్నం మాత్రం జరగడం జరగడం లేదు.
వాల్మీకి రామాయణానికి తెలుగు వన్నెలద్దిన మహిళా కవితామూర్తి మొల్ల నేటికీ స్మరణీయురాలే.కానీ తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన ఆమె నివాసగ్రామమైన బద్వేలు నియోజకవర్గంలోని పెద్దగోపవరం మాత్రం నిరాదరణకు గురవుతోంది. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ప్రాంతాన్ని అటు పురావస్తు శాఖ అధికారులు గానీ, ఇటు పర్యాట శాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ఆదికవి వాల్మీకి 24 వేల శ్లోకాల్లో రచించిన రామాయణాన్ని ఆమె తేట తెలుగులో 871 పద్యాలతో కావ్యంగా రచించి చెరగని ముద్ర వేసుకొంది. ఆ మహాయజ్ఞాన్ని ఆమె అయిదు రోజుల్లో పూర్తి చేసినట్లు దక్షిణ హిందూ స్థానపు కవుల చరిత్రలో కావలి వెంకటరామస్వామి పేర్కొని ఆమె ఘనతను కొనియాడారు. గుర్తుగా ఆమె కూర్చొని కవిత్వం రాసిన బండ మాత్రం ఏటా పండుగల సందర్భంగా పూజలను అందుకొంటోంది. ఈమె ఆరధ్య దైవమైన శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం నేచదరమైంది. ఆమె పూజించిన శివలింగం కాలగర్భంలో కలసి పోగా పానుమట్టం మాత్రమే మిగిలింది. వినాయకుడు, తదితర దేవతామూర్తి విగ్రహాలకూ ఇదే దుస్థితి పట్టింది.
శివకేశవుల బేధం ఉన్న రోజుల్లో ఇద్డరూ ఒకటేనని సమాజానికి చాటిచెప్పిన మహనీయురాలు ఆమె. రాముడిని, వేణుగోపాలుడ్నీ, శ్రీకంఠమల్లేశ్వరుడినీ ఆరాధించి ఆధ్యాత్మికంలో ఉన్న గొప్పదనాన్ని చాటింది. ఈ ఆలయాలు ఇప్పటికీ ఆమె జ్ఞాపికలుగా గ్రామంలో నిలిచాయి.
మొల్ల మాండలికాలపై సాహిత్య శోధనలు చేయాలి
మొల్ల తాను రచించిన రామాయణంలో గోపవరం ప్రాంత ప్రజలు మాట్లాడుకొనే పదాలనే కవిత్వంలో వాడిందని, వీటిపై సాహిత్య పరిశోధనలు జరిపించాలనికవయిత్రి మొల్ల సాహిత్య పీఠం గౌరవాధ్యక్షులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏటా మార్చి 13న ఆమె జయంతిని జరుపుతున్నామని తెలిపారు. మొల్ల నివసించిన ఇంటిని స్మారక మందిరంగా మార్చాలని కోరారు.18,19 శతాబ్దాలలో కందుకూరి వీరేశలింగం పంతులు, బద్వేలుకు చెందిన ఆధునిక కవులు జంగా నరసింహశాస్త్రి, జనమంచి శేషాద్రి శర్మ, యాదాటి నరసింహశర్మ తదితరులు మొల్ల రామాయణం గూర్చి చర్చించారని తెలిపారు.
Subscribe to:
Posts (Atom)
