బెంగుళూరులో బాంబు పేలుళ్ళు - ఒకరి మృతి, 15 మందికి గాయాలు
ఈరోజు శుక్రవారం మధ్యాహ్న నమాజు సమయంలో బెంగుళూరు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొన్ని నిమిషాల తేడాలో 7 బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో ఒక మహిళ చనిపోగా పదహైదు మంది గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. ఈ పేలుళ్ల గురించిన వార్తలు సర్వత్రా వ్యాపించడం వల్ల ఒత్తిడి పెరిగి టెలిఫోన్ నెట్వర్కులు జామ్ అయ్యాయి. మడివాళ, అడుగోడి, కోరమంగళ, హోసూరు రోడ్డు, మైసూరు రోడ్డు, నాయదహళ్ళి లలో పేలిన ఈ బాంబులు తక్కువ తీవ్రత గల నాటు బాంబులని, టైమర్ సహాయంతో వీటిని పేల్చారని పోలీసులు తెలిపారు. పేలుళ్ళు జరిగిన ప్రాంతాలకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లను పంపారు. పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్ళను మూసేశారు. జమ్మూ కాశ్మీరులో అమరనాథ్ యాత్రీకుల సౌకర్యార్థం ఆలయ బోర్డుకు రాష్ట్రప్రభుత్వం 40 హెక్టార్ల అటవీభూమిని కేటాయించబోయి విరమించుకున్న నేపథ్యంలో ఈ పేలుళ్ళు హిందూ అతివాదుల చర్య అని అనుమానిస్తున్నారు.
Update:
పేలుళ్ళ వివరాలు:
1. 1.20 pm, మడివాళ బస్ డిపో
2. 1.25 pm, మైసూరు రోడ్డు
3. 1.40 pm, అడుగోడి
4. 2.10 pm, కోరమంగళ
5. 2.25 pm, విఠ్ఠల్ మల్లయ్య రోడ్డు
6. 2.35 pm, లాంగ్ ఫోర్డ్ టౌన్
7. రిచ్ మాండ్ టౌన్












